పెదఖేర్జలలో పర్యటించిన జిల్లా మలేరియా అధికారి

81చూసినవారు
పెదఖేర్జలలో పర్యటించిన జిల్లా మలేరియా అధికారి
దోమల నివారణకు ఏసీఎం ద్రావణాన్ని ఇంటింటికీ పిచికారీ చేయిస్తున్నామని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ టీ. జగన్మోహనరావు వెల్లడించారు. ఈ మేరకు కొమరాడ మండలం పెదఖేర్జల గ్రామంలో చేపడుతున్న మొదటి విడత దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని ఆదివారం పర్యవేక్షించారు. ప్రతి ఇంటిలో ఏ మేరకు దోమల మందు పిచికారీ చేస్తున్నారు, స్ప్రే చేస్తున్న తీరు, వినియోగించిన దోమల సంహారిణి, ఏసీఎం మోతాదు స్వయంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్