ఈవిఎం గోదాముల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

70చూసినవారు
నెల్లిమర్లలోని ఈవిఎం గోదాముల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ శుక్ర‌వారం త‌నిఖీ చేశారు. గోదాముల‌కు, గ‌దుల‌కు వేసిన సీళ్ల‌ను తెరిపించి ప‌రిశీలించారు. అనంత‌రం సీళ్లు వేయించారు. ఎన్నిక‌ల్లో వినియోగించ‌నవి, రిజ‌ర్వులో ఉంచిన‌ ఈవిఎంల‌ను త‌ర‌లించేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు లేఖ రాయాల‌ని ఆర్‌డిఓను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. ఈవిఎం గోదాముల ప్ర‌క్క‌న నీరు నిల్వ‌కుండా చ‌ర్య‌లు త‌సుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు.

సంబంధిత పోస్ట్