కులమతాలకు అతీతంగా పథకాలు అందజేత
కులమతాలు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు అందించారని జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు వెల్లడించారు. నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న వైసిపిని ఆదరించాలని కోరారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సంక్షేమ పాలన వైసిపికే సాధ్యమని చెప్పారు.