గిరిజన సమస్యలు పరిష్కరించాలి

57చూసినవారు
గిరిజన సమస్యలు పరిష్కరించాలి
గిరిజనులతో చేపల సొసైటీ ఏర్పాటు చేసి ఉపాధి పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరారు. మెంటాడ మండలంలోని ఆండ్ర, లోతుగెడ్డ గ్రామాల గిరిజనులు ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ శంకర్రావుకు శనివారం వినతిపత్రం సమర్పించారు. గిరిజనుల భూ సమస్యను పరిష్కరించాలని, గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాకోటి రాములు, తామరపల్లి సోములు, తదితర గిరిజన నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్