
బలిజిపేట: ఐదో రోజు పది పరీక్షకు 460మంది హాజరు
బలిజిపేట మండలంలో పదో తరగతి పరీక్షలు ఐదవ రోజు ప్రశాంతంగా జరిగినట్లు మండల విద్యాశాఖ అధికారి -1 సామల సింహాచలం తెలిపారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బలిజిపేట ఎ కేంద్రంలో 157 విద్యార్థులకు గాను, 156 మంది, బి కేంద్రంలో 138 మంది, వంతరాం పరీక్ష కేంద్రంలో 167కు 166 మంది పరీక్షలకు హాజరయ్యారని ఆయన తెలిపారు.