![మాదక ద్రవ్యాలును ప్రజలు వ్యతిరేకించాలి: ఎస్ ఐ మాదక ద్రవ్యాలును ప్రజలు వ్యతిరేకించాలి: ఎస్ ఐ](https://media.getlokalapp.com/cache/ab/a6/aba6984162ffca13bafa2ee7288030f4.webp)
మాదక ద్రవ్యాలును ప్రజలు వ్యతిరేకించాలి: ఎస్ ఐ
వచ్చే నెల (జూన్) 4 వరకు ఎన్నికల కోడ్ కారణంగా 144 సెక్షన్ నడుస్తున్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పాచిపెంట ఎస్ఐ పి నారాయణరావు ప్రజలను కోరారు. శుక్రవారం పూడి గిరిజన గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కోడ్ అమల్లో ఉన్నందున గొడవలకు, తగాదాలకు వెళ్లి కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత నియమాలు, ఫోక్సో దిశ చట్టాలపై అవగాహన కల్పించారు.