పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై జనసేన కాకినాడ జనసేన MP అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. "పిఠాపురంలో ఎవరు పోటీ చేసినా పవన్ గెలుపు ఖాయం. ఈ నెల 31 నుంచి పిఠాపురంలో పవన్ వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. మా నాయకుడికి భయపడి వైసీపీ మండలానికో ఇన్ఛార్జ్ని నియమించింది. ముద్రగడ వైసీపీ కోసమే పనిచేశారు.. అందుకే ఆ పార్టీలో చేరారు." అని ఆయన పేర్కొన్నారు.