అభివృద్ధి చేసినా ప్రజల అభిమానాన్ని ఓట్ల రూపంలో పొందలేకపోయామని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి చేయాలనే జగన్ ఆలోచనను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారో అర్థం కావట్లేదని చెప్పారు. ఎప్పుడూ వైసీపీ వెనుక ఉండే రెల్లిపేటలో సైతం ఓట్లు తక్కువ పడ్డాయని తెలిపారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించి డెవలప్ చేసినా.. తనకు ఓటమి తప్పలేదని పేర్కొన్నారు.