పోలీస్ సైరన్.. రూ.2 కోట్లు రోడ్డుపై పడేశారు!

550చూసినవారు
పోలీస్ సైరన్.. రూ.2 కోట్లు రోడ్డుపై పడేశారు!
పోలీసులు వెంబడిస్తున్నారనే భయంతో అర్థరాత్రి ఆగంతకులు రూ.2కోట్ల నగదును రహదారిపై పడేసి వెళ్లారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షిలో చోటు చేసుకుంది. పోలీస్ సైరెన్ వినిపించడంతో ఇళ్ల ముందు డబ్బు సంచులు పడేసి వెళ్లిపోయారు. కొంతసేపు ఆగి వచ్చి చూడగా అందులో రూ.40 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. అక్కడి ప్రజలను విచారించి లాభం లేక మిగతా డబ్బుతో వెనుదిరిగారట. ఈ డబ్బు హిందూపురానికి తరలిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్