గంగా పార్వతి సమేత సిద్దేశ్వర స్వామి ఆలయంలో పూజలు

66చూసినవారు
కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామంలో వెలసిన గంగా పార్వతి సమేత సిద్ధేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ పూజారి శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన, పంచామృత అభిషేకం చేశారు. అర్చకులు భక్తులను ఆశీర్వదించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.