దొనకొండ: రహదారి ప్రమాదంలో మహిళ మృతి

50చూసినవారు
దొనకొండ: రహదారి ప్రమాదంలో మహిళ మృతి
రహదారి ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన దొనకొండ మండలంలోని కొచ్చర్లకోట గ్రామంలో శనివారం చోటు చేసుకున్నది. గ్రామంలో చీరాల సంతమ్మ (48) అనే మహిళ శనివారం రోడ్డు దాటుతున్న క్రమంలో సిమెంటు లోడుతో వెళ్తున్న లారీ మహిళను వేగంగా ఢీకొట్టింది. 108 వాహనంలో మార్కాపురం వైద్యశాలకు మహిళను తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న ఎస్సై విజయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.