

దర్శి: బలమైన రాయితో కొట్టడంతో మహిళ మృతి
కురిచేడు మండలం బోధనం పాడు గ్రామం వద్ద ఆదివారం లక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. త్రిపురాంతకం సీఐ అస్సాన్ సంఘటన ప్రదేశాన్ని పరిశీలన చేసిన అనంతరం మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. మహిళను గుర్తుతెలియని వ్యక్తి బండరాయితో బలంగా తల పైన కొట్టడంతో మృతి చెందిందని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. మృతురాలి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.