Mar 30, 2025, 09:03 IST/
మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది: TPCC చీఫ్
Mar 30, 2025, 09:03 IST
తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. HYD-గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, కేబినెట్ మంత్రులు ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ పేదల దేవాలయం లాంటిదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.