యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్రం పీఎం ఇంటర్న్షిప్ పథకాన్ని తీసుకొచ్చింది. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. దాదాపు 350 కంపెనీల్లో లక్షన్నర మందికి ఇంటర్న్పిప్ అవకాశాలను కేంద్రం కల్పించనుంది. ఎంపికైన వారికి ఏడాది శిక్షణ ఉంటుంది. వన్టైం గ్రాంట్ కింద రూ.6 వేలతో పాటు ప్రతినెలా రూ.5 వేల చొప్పున ఇవ్వనుంది. అర్హులు వెబ్సైట్: https://pminternship.mca.gov.in/ లో దరఖాస్తు చేసుకోగలరు.