హనుమంతునిపాడు: ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

74చూసినవారు
హనుమంతునిపాడు: ప్రజా దర్బార్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
హనుమంతునిపాడు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆయన నేరుగా అర్జీలను స్వీకరించారు. శాఖల వారీగా అర్జీలను అధికారులకు అందజేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.