లబ్ధిదారులకు పింఛన్ పెంచడం హర్షనీయం

71చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు పింఛన్ పెంచి ఇవ్వడం హర్షించదగ్గ విషయమని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి పట్టణంలోని 11వ వార్డు కాశిరెడ్డి గిరిజన కాలనీలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన వృద్ధులకు మంగళవారం పెన్షన్లను పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో అర్హులందరికీ పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్