సింగరాయకొండ: ఆలయ గోపురం పై పిడుగు

51చూసినవారు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలోని జాలమ్మతల్లి ఆలయ గోపురంపై పిడుగు పడ్డ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా వర్షం కురుస్తున్న సమయంలో ఆలయ గోపురంపై పిడుగు పడింది. పిడుగుపాటు కు ఓ దేవత విగ్రహం స్వల్పంగా ధ్వంసం అయింది. పూజలు చేసేందుకు ఆలయానికి వచ్చిన అర్చకులు విగ్రహం ధ్వంసం అయినా విషయాన్ని గుర్తించారు. తర్వాత నిశ్చింతగా పరిశీలించగా పిడుగు పడిందని నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్