ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవం వేడుకలు
పొదిలిలో స్థానిక అమ్మవారి శాల బజార్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గునుపూడి చెంచు సుబ్బారావు, భవాని కిరణ్ దంపతులు, భూమ సుమంత్, కొత్త ప్రసాదరావు, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.