
కావలి: ఆ పనులు ఎందుకు జరగట్లేదని ప్రశ్నించిన జడ్పీటీసీ
నెల్లూరులో బుధవారం జరిగిన జడ్పీ సమావేశంలో కావలి మండలం జడ్పీటీసీ జంపాని రాఘవులు పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో సంగం బ్యారేజీ ఛానల్, కావలి పెద్ద చెరువు బ్యారేజ్ రిజర్వాయర్ పనులు సాంక్షన్ చేసినా కూడా ఇప్పుడు ఎందుకు పనులు జరగట్లేదు అని అధికారులను అడిగారు. ఈ పనులు పూర్తయితే కావలి మండలంలో దాదాపు 10 చెరువులకు నీరు అందుతుందని ఆ చెరువుల కింద లక్ష ఎకరాల పంట భూములు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.