
కావలి: 10 తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు కిట్లు పంపిణీ
పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు 'బెస్ట్ ఆఫ్ లక్' చెబుతూ ఆదివారం ఎస్ఎఫ్ఐ కావలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైన కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి అభిలాష్, ఉపాధ్యక్షులు సాయి మాట్లాడుతూ పరీక్షలు రాసే విద్యార్థులు వారికి ఏవైనా సమస్యలు ఎదురైతే ఎస్ఎఫ్ఐ నాయకులకు తెలపాలని కోరారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులను కోరారు.