రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయి: అజీజ్

537చూసినవారు
భారతదేశానికి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మహోన్నత రాజ్యాంగాన్ని అందించారని కానీ కొన్ని శక్తులు ఆ రాజ్యాంగాన్ని కూడా నేడు మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ విమర్శించారు. నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు జన్ని రమణయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్