రవాణా రంగాన్ని కాపాడాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ

84చూసినవారు
రవాణా రంగాన్ని కాపాడాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ
రవాణా రంగాన్ని ప్రైవేటుపరం చేయకుండా కాపాడాలంటూ శుక్రవారం నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు మాట్లాడుతూ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే అధికారాన్ని ప్రైవేటు వారికి అప్పగించాలనే నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సురేష్,ఆటో కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్