వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు

70చూసినవారు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు
బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై మరో కేసు నమోదైంది. గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతిచ్చేందుకు రైతుల శిబిరాలకు వచ్చిన ప్రస్తుత మంత్రి సత్యకుమార్‌పై నందిగం సురేశ్, అతని అనుచరులు దాడి చేశారని ఓ బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నందిగం సురేశ్‌పై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇప్పటికే నందిగం సురేశ్‌పై టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసు నమోదైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్