నెల్లూరు నగరంలోని 40 వ డివిజన్ మూలపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లుగా తాను చేసిన వివిధ సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గం అభ్యర్థి ఖలీల్ అహ్మద్ పాల్గొన్నారు.