రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్

67చూసినవారు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ.20కే భోజనం అందించే పథకాన్ని 100 స్టేషన్లకు పెంచుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51 స్టేషన్లలో ఈ కార్యక్రమం నడుస్తోంది. రైళ్ల జనరల్ క్లాస్ బోగీలు ఆగే చోట ఈ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ వివరించింది. రూ.20కి భోజనంతో పాటు రూ.50కి స్నాక్స్‌ను పరిశుభ్రంగా, అందరికీ అందుబాటు ధరలో ఇస్తున్నామని ఓ ప్రకటనలో చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్