ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు గడువు పెంచాలని ఈసీని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ నెల 30 వరకు గడువు పెంచాలని విజ్ఞప్తి చేశాయి. దీంతో పాటు పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని కోరాయి. అంతకుముందు ఈ నెల 26వరకు పోస్టల్ బ్యాలెట్కు ఈసీ గడువు పొడిగించింది.