ఈ ఏడాది మే 10 నుంచి చార్ధామ్ యాత్ర(గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్) ప్రారంభం కానుంది. అయితే ఈ యాత్రకు వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. యాత్రికులు registrationandtouristcare.uk.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే, వాట్సాప్ నెంబర్ 8394833833 నెంబర్కు యాత్ర అని రాసి సందేశం పంపించడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు.