భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. 118 మంది ఖైదీల పరార్‌

551చూసినవారు
భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. 118 మంది ఖైదీల పరార్‌
నైజీరియాలో కురుస్తున్న భారీ వర్షాలకు జైలు దెబ్బతినడంతో ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. రాజధాని అబుజా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఖైదీలను పట్టుకునేందుకు భద్రతా సంస్థలు గాలిస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు. జైలు కంచె దెబ్బతినడంతో 118 మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. వారిలో పది మందిని పట్టుకోగలిగినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్