జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సోమవారం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ధర్మవరం కొత్తపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణికి మద్దతుగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినట్లు తెలిపారు.