కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ను గురువారం ధర్మవరం టీడీపీ మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగూర్ హుస్సేన్, టీడీపీ నాయకులు ఫణి కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనకు గజమాలతో సత్కరించారు. ఫణి కుమార్ మాట్లాడుతూ. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కదిరి పట్టణ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.