ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఓ పిచ్చోడని హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుతం తెదేపా అభ్యర్థి బాలకృష్ణ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కూడును లాగేసుకొన్నారని, సమీపంలోని తమిళనాడులో ప్రభుత్వం మారినా సీఎం స్టాలిన్ అమ్మ క్యాంటీన్ కొనసాగిస్తున్నారన్నారు. పురపాలక సంఘం పరిధిలోని వార్డుల్లో సోమవారం బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.