చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేసిన ఎమ్మెల్యే

74చూసినవారు
చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందజేసిన ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దాతృత్వం చాటుకున్నారు. బుధవారం కళ్యాణదుర్గంలో చిరు వ్యాపారులకు తన సొంత నిధులతో తోపుడుబండ్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా మంది చిరు వ్యాపారులు సంపాదనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వారికి అండగా నిలిచేందుకు తన వంతు సాయంగా తోపుడు బండ్లు అందజేశామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్