పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం: ఎంపిడిఓ

63చూసినవారు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం: ఎంపిడిఓ
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని సోమందేపల్లి ఎంపిడిఓ సరస్వతి పేర్కొన్నారు. మంగళవారం సోమందేపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ గంగాదేవి నరసింహ మూర్తి అధ్యక్షతన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా పంచాయితీ కార్యాలయం నుండి గ్రామ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you