పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: రాప్తాడు ఎమ్మెల్యే

55చూసినవారు
పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: రాప్తాడు ఎమ్మెల్యే
గత నాలుగు రోజుల భారీ వర్షాలకు రాప్తాడు నియోజకవర్గంలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఆదివారం కుంటిమద్ది చెరువులో గంగపూజ కార్యక్రమానికి హాజరైన ఆమె, రైతులతో మాట్లాడారు. రైతులు సాగు చేసిన వేరుశనగ, కంది, టమోటా, బొప్పాయ వంటి పంటలకు అపార నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రభుత్వం బాధిత రైతులకు వెంటనే పరిహారం అందించాలని ప్రస్తావించారు.