హెచ్ఎల్సీ కి నేడు చేరనున్న తుంగభద్ర జలాలు

560చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం బొమ్మణహల్ హెచ్ ఎల్ సి కి తుంగభద్ర జలాలను విడుదల చేసినట్లు ఎస్ ఈ రాజశేఖర్ మీడియాతో మంగళవారం తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా ఆంధ్ర సరిహద్దులోని 105 కిలోమీటర్ కి తుంగభద్ర జలాలు చేరుతాయన్నారు. వాటా ప్రకారం హెచ్ ఎల్ సి కి 26. 368 టీఎంసీల నీరు విడుదల అవుతాయన్నారు. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీటిని వాదిలారన్నారు. 26వ తేదీ తరువాత 750 క్యూసెక్కులకు నీటి విడుదల పెంచుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్