నారాయణపురం కుడి కాలువకి సాగునీరు అందించండి

64చూసినవారు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు ఎచ్చెర్ల మండలం నారాయణపురం కుడి కాలువకు నీరు అందించాలని ఎండిపోతున్న పంట పొలాలను పరిరక్షించాలని రైతులు కోరారు. సోమవారం ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంపట్నం, పూడివలస, తమ్మయ్య నాయుడు పేట, కుశల పురం, పొన్నాడ రైతులు పలు సమస్యలపై వారు ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నారాయణపురం కుడికాలువకు నీరు అందించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్