టెక్కలిలో మురుగు కాలువలో పడి వ్యక్తి మృతి

60చూసినవారు
టెక్కలి మండాపోలం కాలనీ 4వ లైనులో ఖాళీగా ఉన్న పునాదుల్లోని మురుగునీటి కూపంలో శుక్రవారం ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానిక భూలోకమాత వీధికి చెందిన బాదా రిషికేశ్(42) అనే వ్యక్తిగా స్థానికులు పరిశీలించి గుర్తించారు. అవివాహితుడైన రిషికేశ్ స్థానికంగా పువ్వులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నాటికి పునాదుల్లో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్