ఎన్నికల ప్రచారంలో ఎంపీ రామ్మోహన్
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలో మంగళవారం టిడిపి కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి టిడిపి యొక్క సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఏ గడప తొక్కిన ఏ వీధిని పలకరించిన ఒకటే మాట కూటమి గెలవాలి పాలన మారాలి రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలి అనే మాటే వినిపిస్తుందని ఎంపీ అన్నారు.