కొలతల ప్రకారం పనులు చేయండి
వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని సమీపాలన పాటిస్తూ కొలతల ప్రకారం పనిచేయాలని మెలియాపుట్టి ఎంపీడీవో భాస్కరరావు అన్నారు. ఆయన సోమవారం మండలంలోని పరశురాంపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వేతనదారులతో మాట్లాడుతూ సమయపాలన పాటించాలని త్రాగునీరు తగినంత తీసుకొని పనులు చేయాలని కోరారు. పనులు చేసి సమయంలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని క్షేత్ర సహాయకుడికి ఆదేశించారు.