మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మెలియాపుట్టి మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. వర్షం వలన రైతులకు ప్రజలకు ఉపశమనం కలిగినప్పటికీ పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థిని విద్యార్థులకు కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నట్లు పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. సమయానికి పరీక్షకేంద్రాలకు చేరుకోవడానికి వర్షం ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు.