రావివలసలో పింఛన్లు అందించిన మంత్రి అచ్చెన్నాయుడు

72చూసినవారు
టెక్కలి మండలం రావివలస గ్రామంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం పింఛన్లను అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో పింఛన్ దారుల ఇంటికి స్వయంగా వెళ్లిన మంత్రి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు, వికలాంగులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి వారికి పింఛన్ డబ్బులను అందించారు. ఈయనతో పాటు పలువురు అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్