ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, టెక్కలి ఆర్డీవో డి.సుదర్శన్ దొర తెలిపారు. సోమవారం పాతపట్నం మండల కేంద్రానికి సమీపంలో మహేంద్ర తనయ నదీ కాజ్వే వద్ద వరద నీటి ప్రవాహ ఉధృతిని ఆయన పరిశీలించారు. వరద నీటి ప్రవాహం దృష్ట్యా నదీ వైపు ఎవ్వరూ వెళ్ళకుండా తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.