నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం

54చూసినవారు
నలిమెల భాస్కర్‌కు కాళోజీ సాహితీ పురస్కారం
ప్రముఖ సాహితీవేత్త నలిమెల భాస్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం-2024కు ఎంపిక చేసింది. తెలంగాణ భాషాభివృద్ధికి భాస్కర్‌ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. రూ.1,01,116 నగదు, పురస్కారం ప్రదానం చేయనుంది. ఈ మేరకు సాంస్కృతికశాఖ ముఖ్యకార్యదర్శి ఎ.వాణిప్రసాద్‌ ఉత్తర్వులు జారీచేశారు. భాస్కర్‌కు 14 భాషల్లో పట్టు ఉంది. ఈయన కేంద్ర సాహిత్య అవార్డుతో పాటు, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు అవార్డులు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్