ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి చంద్రబాబు గెలిచారని జగన్ మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బుధవారం రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సింగపూర్లో కూర్చొనని చంద్రబాబు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. బార్కోడ్ల ద్వారా ఇలా చేశారని అనుమానిస్తున్నాం. త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కామ్ జరిగింది. దీనిపై కోర్టుకు వెళ్తాం.’ అని అన్నారు.