ప్రపంచ దేశాల ప్రభుత్వాలు రకరకాల వ్యర్థాలను సముద్రంలోకి పంపిస్తున్నాయి. దీంతో జలాలు కలుషితమవుతున్నాయి. ఇంకా నానాటికి పెరుగుతున్న జనాభా కారణంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లతో మట్టి అన్నదే కనుమరుగై పోయింది. భూమిలోకి వర్షపు నీరు ఇంకే అవకాశమే లేకుండా పోతుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పంట పొలాలు కూడా ఇళ్ల స్థలాలుగా మారి.. చివరకు భూతాపం పెరిగి భూగర్భ జలాలన్నీ అడుగంటిపోతున్నాయి.