హిందూపురంలో ఉద్రిక్తత.. రెండు కార్లు ధ్వంసం

566చూసినవారు
హిందూపురంలో ఉద్రిక్తత.. రెండు కార్లు ధ్వంసం
AP: హిందూపురం నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేత, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డి కారుపై టీడీపీ నేతలు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో వైసీపీ కార్యకర్త నవీన్‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అటు మండికృష్ణాపురం పంచాయతీలో అల్లర్లు జరిగాయి. వైసీపీ బూత్ ఏజెంట్లపై టీడీపీ వర్గీయులు కత్తితో దాడి చేసి పరారైన‌ట్లు స‌మాచారం.