ఏపీ ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు జోస్యం చెప్పారు. ఈసారి ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. కూటమి ఏకంగా 145 సీట్లు గెలుస్తుందన్నారు. మోడీ, అమిత్ షా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం జరుగుందని చెప్పుకొచ్చారు. సీఎం జగన్ చెల్లి షర్మిలను వదిలేశారని, బాబాయ్ను చంపేశారని విమర్శించారు. బొత్సను జగన్ తండ్రి సమానుడని చెప్పడాన్ని గోనె ప్రకాష్ రావు తప్పుబట్టారు.