ఓ నకిలీ భూమి పట్టాకు సంబంధించిన ఫోటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి సత్యప్రసాద్ ఫోటోలు.. రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంపులు ఉన్నాయి. దీనిపై తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ పట్టా నకిలీదని, దానిని నమ్మి ఎవరూ మోసపోవద్దని సూచించింది. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.