కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలిలా!

80చూసినవారు
కూటమి ప్రభుత్వం చేసిన అప్పుల లెక్కలిలా!
జూన్ 12న కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం 43 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది. ద్రవ్య, ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డయింది. ఈ మేరకు ప్రధాన గణాంకాధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అప్పులు కాకుండా, పన్నులు, ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్‌ నుంచి జులై వరకు రూ.44,822 కోట్లు ఖజానాకు చేరింది. ఇందులో జిఎస్‌టి, భూములపై ఆదాయం, పన్నులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, కేంద్రం ఇచ్చిన గ్రారట్లు వంటివి కలిపి రూ.41 వేల కోట్ల వరకు ఉంది.

సంబంధిత పోస్ట్