ఏపీలో కడప పార్లమెంట్ స్థానంపై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..
టీడీపీ నుంచి భూపేష్ రెడ్డిలు పోటీపడుతున్నారు.
వైసీపీ నుంచి అవినాష్రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారం మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య చుట్టూ తిరుగుతూ సాగింది. అవినాష్రెడ్డిని ఓడించాలంటూ షర్మిల, వివేకా కుమార్తె సునీత, వైఎస్సార్ సతీమణి విజయమ్మ ఓటర్లను కోరారు.