ఈసీ ఆంక్షలపై సీఎం జగన్ స్పందన ఇదే

1063చూసినవారు
ఈసీ ఆంక్షలపై సీఎం జగన్ స్పందన ఇదే
వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ (ఈసీ) విధించిన ఆంక్షలపై సీఎం జగన్ స్పందించారు. ‘ఏప్రిల్ 1 నుంచి వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు తన మనిషి నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించారు. జగన్‌ను సూటిగా ఎదుర్కొలేక.. 68 లక్షల మందికి నష్టం కలిగిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దుకు ఓటేసినట్లే.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్